Monday, April 29, 2024

దళిత బంధుపై తీర్పు రిజర్వ్

దళిత బంధు పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. దళిత బంధును ఎన్నికల సంఘం ఆపడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో నాలుగు పిటీషన్‌లు దాఖలయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకం అమలవుతుందని పిటీషనర్లు పేర్కొన్నారు. ఒక్క హుజురాబాద్‌లోనే దళిత బంధు పథకం అమలు కావడం లేదన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అమలవుతుందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పోషన్ అబ్యాన్ కొనసాగించే విధంగానే దళిత బంధు పథకాన్ని కూడా కొనసాగించాలని పిటిషనర్లు కోరారు.

దళిత బంధు పథకాన్ని ఆపడం వలన చాలామంది వెనుకబడిన ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అలాంటి వారు ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు పథకాన్ని ఇప్పుడు ఎన్నికల సంఘం ఆపడం సరైంది కాదని తెలిపారు. వెంటనే కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిన దళిత బంధు పథకాన్ని అమలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును పిటిషన్లను కోరారు. ఈ వాదనలు విన్న హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Danger: కరోనా కొత్త వేరియంట్‌ ఏవై12.. తెలంగాణ‌, ఏపీలో వ్యాపిస్తోందట..

Advertisement

తాజా వార్తలు

Advertisement