Sunday, May 5, 2024

గడ్డి అన్నారం మార్కెట్‌ను వెంటనే తెరవండి: హైకోర్టు

హైదరాబాద్ లోని కొత్తపేట గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను వెంటనే తెరవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేసి తదుపరి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

కాగా, గడ్డి అన్నారం ఫ్రూట్‌ మార్కెట్‌ గతేడాది మూత‌ప‌డ‌నుంది. ఆ మార్కెట్‌ను ప్రభుత్వం బాట‌సింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించాలని నిర్ణయించింది. అయితే, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై పండ్ల వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. కొహెడలో నూతన మార్కెట్ నిర్మాణం పూర్తి చేసే వరకు బాట సింగారంలో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు ఉన్న మార్కెట్ స్థలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేయనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement