Monday, April 29, 2024

కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ అంశంపై ప్రభుత్వం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 8వ తరగతి వరకు బడులను మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, 8వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు లేకుండానే పాస్ చేయించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం వస్తోంది. ఇదే ఈ విషయమై మరో రెండు రోజుల్లోనే స్పష్టమైన ప్రకటన చేయనుంది ప్రభుత్వం. నిన్న అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

8వ తరగతి వరకు పాఠశాలలను మూసివేయాలని, వారిని ఎలాంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే, 9, 10 తరగతులకు మాత్రం ప్రత్యక్ష బోధనను కొనసాగించాలని, లేదంటే బోర్డు పరీక్షలు వారికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీనికితోడు పదో తరగతి పరీక్షల తేదీలను ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తల మధ్య వారికి ప్రత్యక్ష బోధన కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement