Sunday, April 28, 2024

తెలంగాణలో మరోసారి పెరిగిన కరోనా కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,07,472 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 591 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,45,997కి పెరిగింది. అదే సమయంలో 643 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. ఇప్పటిదాకా తెలంగాణలో 6,33,371 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 8,819 మందికి చికిత్స జరుగుతోంది. అటు కరోనా మృతుల సంఖ్య 3,807కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,819 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. రికవరీ రేటు 98.04 శాతం కాగా.. మరణాల రేటు 0.58గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 68 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.

ఇది కూడా చదవండి: బండి పాదయాత్ర వాయిదా..!

Advertisement

తాజా వార్తలు

Advertisement