Wednesday, April 17, 2024

బండి పాదయాత్ర వాయిదా..!

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 9న చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర చేయాలని బండి సంజయ్ భావించారు. అయితే పార్లమెంటు సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల నేపథ్యంలో పాదయాత్రను 24కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు కచ్చితంగా హాజరు కావాలని బీజేపీ విప్ జారీ చేసింది. అలాగే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి పాదయాత్రను వాయిదా వేసినట్లు ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement