Sunday, May 19, 2024

TS : తెలంగాణ‌ కేబినెట్ సబ్ కమిటీ భేటీ..

సచివాలయంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తున్నారు.

అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈనెల చివరిన లేదా వచ్చే నెలలో గ్యారెంటీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement