Monday, May 6, 2024

Telanganaలో రేవంత్ నాయ‌క‌త్వంలో ప్ర‌జా ప్ర‌భుత్వం నిర్మిస్తాంః రాహుల్ గాంధీ

ఢిల్లీ – తెలంగాణలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం రేవంత్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా, రాహుల్‌, ప్రియాంకలను రేవంత్‌ ఆహ్వానించారు. అనంతరం రాహుల్‌ గాంధీ ఎక్స్‌(ట్విటర్‌)లో ఆ ఫొటోలను షేర్‌ చేశారు.. ”తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజా ప్రభుత్వాన్ని నిర్మిస్తాం” అని రాహుల్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement