Monday, April 29, 2024

Breaking: ఎంపీ పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో నిన్న సాయంత్రమే దేశ రాజధానికి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నేతలతో భేటీ తర్వాత ఇవాళ కూడా అక్కడే ఉన్నారు.

తన ప్రమాణ స్వీకారానికి రావాలంటూ సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో సహా పలువురు హైకమాండ్ పెద్దలను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం రేవంత్ రెడ్డి పార్లమెంట్ కు వెళ్లారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు లేఖ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement