Monday, April 29, 2024

తార‌క‌ర‌త్నకు క‌న్నీటితో క‌డ‌సారి అంజ‌లి ఘ‌టిస్తున్న అభిమాన గణం – ఫిలిం ఛాంబర్ నుంచి లైవ్

నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ కు తరలించారు. అంతకు ముందే తారకరత్న బాబాయ్ బాలకృష్ణ మోకిలలోని ఆయన నివాసానికి చేరుకున్నారు. అంబులెన్సులో తారకరత్న భౌతికకాయం పక్కనే బాలకృష్ణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఉన్నారు. ప్రస్తుతం మోకిలలోని నివాసం నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో భౌతికకాయం ఫిలిం ఛాంబర్ కు చేర్చారు.. అక్క‌డ తార‌క‌ర‌త్న పార్దివ‌దేహాన్ని అభిమానులు క‌డ‌సారి చూపులు కోసం ఉంచారు..మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మహాప్రస్థానానికి అంతిమయాత్ర కొనసాగుతుంది. మహాప్రస్థానంలో సాయంత్రం అంత్యక్రియలను నిర్వహిస్తారు. మరోవైపు, ఈ ఉదయం 8 గంటలకు తారకరత్న భౌతికకాయానికి ఆయన కుమారుడి చేత అంతిమ క్రతువులను నిర్వహించారు. .

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement