Monday, April 29, 2024

సీఎం కేసీఆర్‌ కొమురవెల్లి మల్లన్న స్వరూపం – మంత్రి తలసాని

 ప్రజ్ఞాపూర్‌ – సీఎం కేసీఆర్‌ యాదవుల ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న స్వరూపం అని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రజ్ఞాపూర్‌ లో జరిగిన యాదవుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, షీప్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ దూదిమెట్ల బాలరాజ్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌, ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ యాదవుల కులవృత్తి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించే విధంగా ఎక్కడా లేనివిధంగా రూ.11వేలకోట్ల వ్యయంతో 75శాతం సబ్సిడీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తున్నారన్నారు. కొమురవెల్లి మల్లన్న ఆలయం తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకునే, మన అభివృద్ధికి బాటలు వేసే ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement