Thursday, May 2, 2024

Suryapet – వీగిపోయిన సూర్యాపేట చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం ..

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై 32 మంది వార్డ్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది….అవిశ్వాస‌ తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది. కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ప్రకటించారు..


అంత‌కు ముందు . క్యాంపులో ఉన్న 31 మందితో పాటు క్యాంపున‌కు దూరంగా ఉన్న ఆ ఒక్క కౌన్సిలర్ శుక్రవారం రాత్రి నుండి అందుబాటులో లేరు. దీంతో ఎలాగైనా అవిశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం ప్రయత్నం చేశారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఒక్క వార్డ్ కౌన్సిలర్.. నార్కట్ పల్లి లోని వివేరా వద్ద మిగతా 31 మంది కౌన్సిలర్లు ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ నుండి అసంతృప్త కౌన్సిలర్లు వెళ్లిపోగా వారిని బుజ్జగించి తీసుకొచ్చి మ‌రీ అవిశ్వాసం పెట్టారు. బహుజన పార్టీ నుండి వెళ్లిన కౌన్సిలర్ చేయికి హ్యాండ్ ఇవ్వడంతో.. అవిశ్వాసం కథ వీగిపోయింది. వైస్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసం కూడా దాదాపుగా వీగిపోయినట్లేన‌ని స‌మాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement