Sunday, April 28, 2024

Suicide – ఆర్మూరులో మరో విద్యా కుసుమం బలవన్మరణం..

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో ఎస్సీ ఉమెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్న డిగ్రీ విద్యార్థిని గోలి రక్షిత ఉరివేసుకుని బలన్మరణం చెందింది.. ఆత్మహత్యకు కారణాలు తెలీయరాలేదు..

వివరాలలోకి వెళితే , పట్టణంలో ఉన్న ఎస్సీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ రక్షిత స్థానిక డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. ఆదివారం రాత్రి స్నేహితులంతా భోజనం చేస్తుంటే.. తాను మాత్రం తినకుండా తన గదికి వెళ్లింది. ఎందుకు తినడం లేని తోటి స్నేహితులు అడగ్గా.. కాసేపటి తర్వాత తింటానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. గంట తర్వాత రక్షితకు తన మిత్రులు కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. ఏమైందోనని వార్డెన్ ఆమె గది వద్దకు వెళ్లగా తలుపు గడియ పెట్టింది. కిటికీలో నుంచి చూడగా రక్షిత ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. వెంటనే వార్డెన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement