Tuesday, April 30, 2024

కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళన

వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్శిటీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు చదువుతున్న విద్యార్థులు హాస్టల్ ఖాళీ చేయాలంటూ వీసీ ఆదేశాలు ఇవ్వడంతో విద్యార్థులు నిరసనకు దిగారు. ఏబీవీపీ, బీఎస్ఎఫ్, పీడీఎస్యూ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో పరిపాలన భవనానికి విద్యార్థులు భారీగా చేరుకున్నారు. వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీసీ తన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్‌లో పోలీసులు భారీగా మోహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement