Tuesday, April 30, 2024

మంత్రి స‌బితారెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేరిన‌ వార్డు స‌భ్యులు

మహేశ్వరం మండలంలోని అమీర్ పేట్ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యురాలు గుండె మోని ప్రేమలత శ్రీరాములు ముదిరాజు, 10వ వార్డు సభ్యురాలు ఇమ్మడి ఆమని అనిల్, కాంగ్రెస్ నాయకుడు బొమ్మ శ్రీనివాస్ ఈరోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో పాల్గొన్న వారీలో మహేశ్వరం మండల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరి గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పెంటల రాయప్ప, దేవవరం గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పెంటల.వెంకటేశం, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్, కో ఆప్షన్ సభ్యుడు ఆవుల అశోక్, ఎం.వెంకటేష్, అల్వాల మచ్చెందర్, సంభ మల్లేష్, బ్యాగరి రాజు, ఎర్ర రవి ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement