Sunday, May 19, 2024

Breaking: రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య..

వికారాబాద్, (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లాలో ఘోరం జ‌రిగింది. వికారాబాద్ – హైదరాబాద్ వెళ్లే ఆర్ అండ్ బీ రోడ్డులోని రైల్వే ఓవ‌ర్‌ బ్రిడ్జిపై నుండి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఇవ్వాల (సోమవారం) రాత్రి కొద్దిసేప‌టి క్రిత‌మే జ‌రిగింది. మృతుడిని వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనీకి చెందిన శ్రేయస్ (17)గా గుర్తించారు. రైల్వే ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంట‌న్న‌ది తెలియ‌రాలేదు. కాగా, పోలీసులు దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement