టేకుమట్ల (ప్రభ న్యూస్) : మండలంలోని గర్మిల్లపల్లి గ్రామంలో పోలీసులు వాహనాల తనిఖీలను శనివారం రోజున నిర్వహించారు ఈసందర్భంగా ఎస్ఐ బొల్లం వినయ్ కుమార్ వాహనాల పత్రాలను పరిశీలించి వాహనాల పత్రాలు లేని వారికి జరిమానా విధించారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రైవర్లు ద్విచక్ర వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అన్నారు వాహనదారులు సీటు బెల్టు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని అన్నారు గూడ్స్ వాహనాల్లో కూలీలను తరలించవద్దని పరిమితికి మించి తరలిస్తే జరిమానా విధించడంతో పాటు వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital