Thursday, May 2, 2024

కాళోజీ గ్రంథాలయం ప్రారంభం – ప్రభుత్వ విప్ సుమన్

యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కాళోజీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 75 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన కాళోజీ శాఖ గ్రంథాలయ భవనాన్ని, నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభించారు. పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత‌ . ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ , పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత,బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య , మంచిర్యాల జిల్లా జడ్పి చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి , మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోళీ కేరి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రవీణ్, అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement