Sunday, April 28, 2024

రాష్ట్ర అభివృద్ధి టిఆర్ ఎస్‌తోనే సాధ్యం

రాష్ట్ర అభివృద్ధి టిఆర్ ఎస్‌తోనే సాధ్యమ‌ని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఈ రోజు కాచారం గ్రామంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఆయ‌న సమ‌క్షంలో ధారూర్ మండలం మున్నూరు సోమారం , కాచారం గ్రామాల వివిధ పార్టీలకు చెందిన మాజి ఉపసర్పంచులు సాయన్న, అనంతయ్య, వార్డు మెంబెర్ రవి, మాజి వార్డు మెంబెర్ రాములు ప్రజాప్రతినిధులు మాజి ప్రజాప్రతినిధులు నాయకులు 50 మందికి పైగా టిఆర్ ఎస్‌లో చేరారు. ఈ సంంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చూసి మరింత అభివృద్ధికై తెరాస పార్టీలో స్వచ్చందంగా చేరుతున్న కార్యకర్తలకు స్వాగతం తెలుపుతూ ప్రతి ఒక్కరు పార్టీ ప్రతిష్టతకై కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement