ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు 1 లక్షా 47 వేల మందికి పైగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ (DBT) ద్వారా రూ.700 కోట్లను బదిలీ చేశారు. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద లబ్ధిదారులకు పక్కా గృహాల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ, 700 కోట్లు రూపాయలను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన తరువాత ప్రసంగించారు.