Tuesday, April 30, 2024

డబుల్ ఇండ్లు ప్రారంభం.. లబ్ధిదారులకు ఇంటి పత్రాలు అందించిన మంత్రి గంగుల

అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ గృహాలను అందజేసినట్లు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలంలో 40 డబుల్ బెడ్రూం గృహాల పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మగ్గంపూర్ లో 52 మంది డబుల్ బెడ్రూం గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, ప్రస్తుతం 40 మందికి ఇంటి పత్రాలు అందజేశామన్నారు. కాగా, మరో 12 మందికి త్వరలోనే ఇంటి పత్రాలు అందిస్తామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement