Monday, April 29, 2024

శ్రీరాముడికి బంగారు కిరీటాన్ని స‌మ‌ర్పించిన మంత్రి కొడాలి

ఏపీ మంత్రి కొడాలి నాని ఈరోజు భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆయ‌న కుటుంబ సమేతంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీరాముడికి రూ.13లక్షలు విలువ చేసే బంగారు కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఈ కిరీటాన్ని ఆలయ అర్చకులకు అందించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఏపీ ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా జీవించాలనేదే జగన్ ఆకాంక్ష అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించానని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement