Monday, April 29, 2024

బోనం ఎత్తిన – స్పీక‌ర్ పోచారం

బాన్సువాడ (కామారెడ్డి జిల్లా) : పాత బాన్సువాడ ఆశాడమాస దుర్గామాత బోనాలు .. శ్రీ కనకదుర్గా దేవి మందిరం 4వ వార్షికోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి . స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు స్పీకర్ పోచారం . దుర్గా మాత గుడిలో పూజలు చేశారు. ఈసందర్భంగా భక్తులను ఉద్దేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ …ఆషాఢ‌మాస బోనాల పండుగ సందర్భంగా అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రూ.70 లక్షలతో దుర్గా మాత ఫంక్షన్ హల్ నిర్మించాం అన్నారు. ఈ ఫంక్షన్ హల్ పేదల కోసం, కిరాయి కేవలం రూ. 5 వేలు మాత్రమే. పేదలు తక్కువ ఖర్చుతో ఫంక్షన్లు జరుపుకోవడానికి నియేజకవర్గంలో 80 ఫంక్షన్ హల్స్ కట్టిస్తున్నాం. దుర్గా మాత గర్భ గుడి, మందిరం నిర్మాణానికి పూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నాను. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు DCCB చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ జంగం గంగాదర్, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ ప్రజాప్రతినిధులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement