Thursday, April 18, 2024

అదృశ్య‌మ‌య్యాడు – కాలిబూడిదై క‌నిపించాడు

జిన్నారం, (ప్ర‌భ‌న్యూస్‌)- సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల పరిధిలోని లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద యువకుడు దహనమైన శరీరం లభ్యమైంది. నగరంలోని కె. పి. హెచ్. బి పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన యువకుడిని జిన్నారం మండలం లక్ష్మీపతి గూడెం బ్రిడ్జి వద్ద హత్య చేసి దహనం చేసినట్లుగా స‌మాచారం. మృతుడు కే పీ హెచ్ బీ లో నివాసముండే నారాయణరెడ్డి (25) గా గుర్తించారు. కె. పి. హెచ్. బి కాలనీలో గత నెల 30వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని కె పి హెచ్ బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే అతని శవం నేడు కాలిపోయి లభ్యం అయ్యింది. సంవత్సరం క్రితం నారాయణ రెడ్డి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు, యువతిని తీసుకుని వెళ్లి హౌజ్ అరెస్ట్ చేశారు. ఇపుడు నారాయణ రెడ్డి శవమై తేలడం పలు అనుమానాలకు తావిస్తోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన కె పి హెచ్ బి, జిన్నారం పోలీసులు హత్యకు సంబంధించిన పూర్తి వివరాలపై విచారణ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement