Saturday, April 27, 2024

స్పీకర్ పోచారం బర్త్ డే.. కేక్ కట్ చేయించిన మంత్రులు

నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పుట్టినరోజు. దాంతో రాష్ట్ర మంత్రులు ఆయన ఛాంబర్‌లో పోచారానికి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు స్పీకర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్‌తో కేక్‌ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో అధికారులు..తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement