Thursday, May 2, 2024

రెండు రోజుల్లో కరోనా తగ్గుముఖం: మంత్రి హరీష్ రావు

తెలంగాణ ప్రభుత్వం  వైద్య రంగంలో ఎంతో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మహీంద్ర అండ్ మహీంద్రా కంపెనీ  ఆధ్వర్యంలో రూ.1.05 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆక్సిజన్  జనరేషన్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు. జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ ఏర్పాటు   చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఇది 86వ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ అని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని, రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలపాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో 500  మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్ అవసరం పడిందన్నారు. 200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉండటంతో మిగతా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తమిళనాడు, గోవా రాష్ట్రాల నుండి తెప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డామన్నారు.  ఈ పరిస్థితి గమనించి‌ సీఎం 500 మెట్రిక్ టన్నులకు ఆక్సిజన్ ఉత్పత్తి  పెంచాలని ఆదేశించారన్నారు. ప్రస్తుతం‌ 300 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేరుకున్నామని, మరో 2౦౦ మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి పాశమైలారంలో ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు  అగ్రిమెంట్ చేసుకున్నామన్నారు. త్వరలో ఇది ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో 27 వేల పడకలు ఉంటే ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించామని మంత్రి హరీష్ చెప్పారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఆక్సిజన్ కొరత ఉండదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో‌గుణాత్మక మార్పులు తీసుకు వచ్చిందన్నారు. సీఎం ఆదేశాల మేరకు‌ చేపట్టిన జ్వర సర్వే మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. రెండు , మూడు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ రేటు తగ్గిందన్నారు. అయినా అలసత్వం వద్దనీ, అందరూ మాస్క్ ధరించి, వాక్సిన్ వేయించుకోవాలన్నారు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాల అభివృధ్ది చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలో సౌకర్యాల కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన  అనంతరం మంత్రి  జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని‌‌ సందర్షించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిలో 50  పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని  త్వరలో ఏర్పాటు‌చేస్తామన్నారు. అదేవిధంగా బ్లడ్ బ్యాంక్ లేదా బ్లడ్ స్టోరేజీ యూనిట్ను ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో‌ డెలివరీలు పెరిగాయన్నారు. ప్రస్తుతం‌ 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని‌ 75 శాతంకు పెంచాలన్నారు. సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నార్మల్‌ డెలివరీలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా వైద్యులను, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. అనవసరంగా సెక్షన్ సర్జరీలు చేయవద్దన్నారు. దీని వల్ల‌ తొలి‌గంటలో శిశువుకు ‌అందాల్సిన  అమృతమైన పాలు అందడం లేదన్నారు. దాంతో శిశువుల్లో రోగ నిరోథక శక్తి తగ్గిపోతుందన్నారు. రాష్ట్రంలో‌ఇలా‌ 66 శాతం మంది‌ శిశువులకు తొలి‌గంటలో పాలు అందడం‌ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర సర్జరీల వల్ల‌ 35 ఏళ్లకే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు.

- Advertisement -

ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్ భారత్‌ కింద ఏరియా ఆస్పత్రిలో‌ వైద్య చికిత్సలు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలు మరింత పెరగాలన్నారు. డిపార్ట్మెంట్ల వారీగా పని తీరును అడిగి‌ తెలుసుకున్నారు. మందుల‌కొరత, నిధుల‌కొరత ప్రభుత్వం రానివ్వదని, చక్కటి‌ వైద్యం పేదలకు అందించాలని సిబ్బందికి‌ మంత్రి ‌సూచించారు. రోగులను ప్రేమగా పలకరించాలని, మర్యాదగా వ్యవహరించాలన్నారు. డాక్టర్లు వృత్తిని, ఉద్యోగ ధర్మాన్ని  మరువవద్దని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులలో వైద్య సేవలు అందించేలా పనిచేయాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement