Sunday, April 28, 2024

IPL : చెన్నై జ‌ట్టులో సిరిసిల్ల కుర్రోడు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2024 సీజన్‌లో ఆడేందుకు తెలంగాణ క్రికెట్‌కు అవ‌కాశం ద‌క్కింది. తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్ల‌కు చెందిన క్రికెటర్ అవనీశ్‌రావు చెన్నై జ‌ట్టుకు ఆడ‌బోతున్నాడు.

ఐపీఎల్ వేలంలో అరవెల్లి అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ కొనుగోలు చేసింది. అవనీశ్‌ని అతడి కనీస ధర రూ. 20 లక్షలకు చెన్నై తీసుకుంది. వేలం చివర్లలో ఈ 18 ఏళ్ల హర్డ్ హిట్టర్, వికెట్ కీపర్‌ని సీఎస్‌కే కొనుగోలు చేసింది. అవనీశ్‌ రావుది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం. దక్షిణాఫ్రికాలో వచ్చే ఏడాది ఆరంభమయ్యే అండర్-19 ప్రపంచకప్‌కు అవనీశ్ ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2024 వేలంలో మొత్తం 11 మంది తెలుగు ఆటగాళ్లు బరిలో నిలవగా.. కేఎస్ భరత్‌, అవనీశ్ రావు మాత్రమే అమ్ముడయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement