Sunday, April 28, 2024

Telangana Bhavan: బీఆర్ఎస్‌కు షాక్‌.. తెలంగాణ భ‌వ‌న్‌కు నోటీసులు..

తెలంగాణ భ‌వ‌న్‌కు రెవెన్యూశాఖ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ భ‌వ‌న్‌లో టివి ఛాన‌ల్‌ను న‌డ‌ప‌మేంట‌ని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ భవన్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి దీనిపై వివరణ ఇవ్వాలని, అలాగే ఎప్పటిలోగా ఛానల్ షిప్ట్ చేస్తారో స్పష్టతనివ్వాలంటూ నోటీసులు పంపించారు.

బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో టీ న్యూస్ ఛానల్ ద్వారా వ్యాపారం చేస్తున్నారంటూ నోటీసులో పేర్కొంది. 2011 నుంచి టీ న్యూస్ ఛానల్‌ను బీఆర్ఎస్‌ భవన్‌లోనే యాజమాన్యం నిర్వహిస్తోంది. 2011 ఏప్రిల్ లో టీ న్యూస్ ను స్థాపించగా.. అప్పటి నుంచి ఛానల్ నిర్వహణ తెలంగాణ భవన్ లోనే కొనసాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో టీన్యూస్ ను ఎలా నిర్వహిస్తున్నారో చెప్పాలని రెవెన్యూ శాఖ నోటీసుల్లో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement