Tuesday, May 14, 2024

ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన ష‌ర్మిల

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మెద‌క్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈరోజు జిల్లాలోని వర్గల్ మండలం దండుపల్లిలో పర్యటించిన షర్మిల ఆత్మహత్య చేసుకున్న రైతు చింతలస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… ధరణిలో లోపాల వల్ల రైతులు ప్రాణాలు కోల్పోతున్నార‌ని అన్నారు. సీఎం నియోజకవర్గంలోనూ భూసమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమస్య పరిష్కారం కాదు.. భూమి వదులు కోవాల్సిందే అనడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. బాధిత రైతు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ధరణి ఎవరికి మేలు చేయడానికి అని ష‌ర్మిల‌ ప్రశ్నించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement