Saturday, May 4, 2024

Shabir Ali – దొరలపాలనను సాగనంపుదాం.. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందాం

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)22:తెలంగాణలో దొరలపాలనను సాగనంపి. ప్రజా తెలంగాణను ఏర్పాటు చేసుకుందామని నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్ నిజామాబాద్ నగరంలో మున్నూ రు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘం సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారునిజామాబాద్ పట్టణంలో మున్నూరు కాపులు నిజామా బాద్ ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వలు పేదలకు యువతకు ఉరితాళ్లు మిగుల్చు తున్నాయని తెలిపారు.

ము న్నూరు కాపులకు చేయూతలో ముందు వరుసలో ఉంటాను. వారి కుటుంబాలకు ఆదుకునే పథకాలు తీసుకువస్తామని అన్నారు. ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులకు సమచిత స్థానం కల్పించింది. రాబోయే రోజుల్లో మీ సమస్య ల ను నెరవేరుస్తామని హామీ ఇచ్చా రు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ ప్రకటిం చిన ఆరు పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామ న్నారు.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెలా మహిళలకు రూ. 2500 అందిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. గృహ జ్యోతి ద్వారా ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement