Monday, April 29, 2024

ADB: అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత

బోథ్, అక్టోబర్ 15 (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల సరిహద్దులో అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ అయిన ఘన్ పూర్ వద్ద ఈరోజు రెండు గంటలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ ఎస్సై లోకానంద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా.. మహారాష్ట్ర నుంచి బజార్ మండలంలోని భూతాయకి గ్రామానికి చెందిన ముర్కటి నారాయణ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై గంజాయిని తీసుకువస్తుండగా పట్టుకున్నారు.

అతని వద్ద 51ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. దాని విలువ దాదాపు రూ.10,000 ఉంటుందని, వ్యక్తిని, ద్విచక్ర వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సయిజ్ హెచ్ సీ రమేష్, పోలీసు హెచ్ సీ విఠల్, కానిస్టేబుల్ రామ్మూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement