Sunday, April 28, 2024

Peddapalli: సంక్షేమాన్ని చూసి.. గులాబీ గూటికి.. ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్‌, ఆగస్టు 29 (ప్రభ న్యూస్‌): తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై గులాబీ గూటిలో చేరుతున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సుల్తానాబాద్‌ పట్టణానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు అరేపల్లి మధు (ప్రవీణ్‌ కుమార్‌) గులాబీ గూటిలో చేరగా, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి కండువా కప్పి భారత రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షిస్తున్న వారంతా బీఆర్‌ఎస్‌లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. ఈకార్యక్రమంలో బీఅర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు తిప్పారపు దయాకర్‌, ఆరేపల్లి ఎల్లారావు, కల్వల రాజేష్‌లు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement