Saturday, May 4, 2024

సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. 10మంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 10మంది వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లను అరెస్ట్ చేశారు. 8 వాట్సాప్ గ్రూప్ ల ద్వారా అడ్మిన్లు ఆర్మీ ఉద్యోగ అభ్యర్థులను రెచ్చగొట్టారని పోలీసులు గుర్తించారు. సాయి డిఫెన్స్ అకాడమి డైరెక్టర్ సుబ్బారావు పోలీసుల అదుపులో ఉన్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఆఫీసులో సుబ్బారావు విచారణ కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement