Wednesday, May 1, 2024

Breaking: మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు

మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. శామీర్ పేట పీఎస్ లో మల్లారెడ్డిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. గిరిజనులు భూములు కబ్జా చేశారని మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఫిర్యాదు చేశారు. 47ఎకరాల భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఎన్నికల సమయంలో రాత్రిక రాత్రే భూములను కబ్జా చేశారని, అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో మల్లారెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక ఎమ్మార్వోపైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం నాలుగు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 420 కింద కూడా కేసు నమోదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement