Friday, April 26, 2024

Telangana: అంగన్వాడీలకు చేనేత చీరలు..

తెలంగాణలో అంగన్వాడీలకు మరో అరుదైన గౌరవం దక్కింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలను సముచితంగా గౌరవించేందుకు ఇప్పటికే ఎక్కడా లేని విధంగా మూడు సార్లు వేతనం పెంచి, 30 శాతం పీఆర్సీ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పుడు నేతన్నలను ప్రోత్సహించడంలో భాగంగా అంగన్వాడీలకు చేనేత వస్త్రాలు అందించింది. హైదరాబాద్ లో మంత్రులు కేటిఆర్, సత్యవతి రాథోడ్ కలిసి ఈ చేనేత చీరలను అంగన్వాడిలకు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత జుట్ బ్యాగులను విడుదల చేశారు.

రాష్ట్రంలోని 31,711 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు, 3989 మిని అంగన్వాడీ కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించినట్ల తెలిపారు. ఇప్పుడు తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు. అంగన్వాడీలకు గౌరవ ప్రదమైన వస్త్రాలు..సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నాం అని చెప్పారు. అలాగే, ప్రి ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని వివరించారు. అంగన్వాడీలకు అభినందనలు, ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, చేనేత- జౌళీ శాఖ మంత్రి కేటిఆర్ మార్గదర్శకంలో ప్రభుత్వం తమ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేస్తామని హామీ ఇస్తున్నట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement