Sunday, April 28, 2024

Breaking: డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని.. సర్పంచ్ పై పెట్రోల్ తో దాడి….

బిక్కనూర్, డిసెంబర్ 19 (ప్రభ న్యూస్) : డబుల్ బెడ్ రూమ్ ఇవ్వలేదన్న కోపంతో ఒక వ్యక్తి సర్పంచిపై పెట్రోల్ పోసి హ‌త్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం సిద్ధిరామేశ్వర నగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి.. గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు కాకపోవడంతో గత కొన్ని రోజులుగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ పై కక్ష పెంచుకున్నాడు. సర్పంచి వళ్ళనే తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సర్పంచి శ్రీనివాస్ వద్దకు పెట్రోల్ తీసుకొని వచ్చి ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నం చేశారు. పసిగట్టిన శ్రీనివాస్ వెంటనే తప్పించుకొని బయటకు పరుగులు తీశారు. దీంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉన్న కుర్చీలు ఇతర సామాగ్రి అంటుకున్నాయి. విషయం గమనించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులకు సమాచారం అందించగా.. వారు సంఘటనా స్థలానికి చేరుకొని రంజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. సర్పంచ్ శ్రీనివాస్ తప్పించుకోవడంతో పెను ప్రమాదం నుండి బయటపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement