Thursday, May 2, 2024

TS: ఇసుక లారీలను నియంత్రించాలి.. మంత్రి సీతక్క

ములుగు: ఇసుక లారీలను నియంత్రించాలని మంత్రి సీతక్క అధికారిణి ఆదేశించారు. అధిక లోడు వచ్చే లారీలతో రోడ్లు మొత్తం గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతర దృష్ట్యా ఇసుక లారీల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడాల్సిన బాధ్యత మన పైన ఉంద‌ని, -ఓవర్ లోడ్ తో వచ్చే లారీలను అనుమతించకుండా అధికారులు చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించారు. మేడారం జాతర పనుల విషయములో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. అధికారులను అయితే ఇంటికి కాంట్రాక్టర్లు అయితే బ్లాక్ లిస్ట్‌లో పెట్ట‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement