Thursday, May 2, 2024

HYD : స‌బితా ఇంద్రారెడ్డి వాహ‌నం త‌నిఖీ

విద్యా శాఖ మంత్రి,మహేశ్వరం నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. గురువారం నాడు ప్రచార రథాలను ప్రారంభించి వెళ్తుండగా బాలాపూర్ శివాజీ చౌక్ వద్ద మంత్రి కాన్వాయ్ వాహన శ్రేణిని నిలిపి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు.

వాహనం దిగి సబితా ఇంద్రారెడ్డి తనిఖీకి పోలీసులకు పూర్తిగా సహకరించారు. పోలీసులు మంత్రి పర్సును కూడా తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement