Saturday, May 18, 2024

TS | ‘మధ్యాహ్న భోజనానికి’ రూ.97 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు విద్యాశాఖ రూ. 97 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు శనివారం తెలిపారు. 9, 10 తరగతులు చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సమకూర్చేందుకు మూడు రోజుల క్రితం రూ.27 కోట్లు విడుదల చేయగా, 1 నుంచి 8 తరగతుల వారికి తాజాగా రూ.70 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.97 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులను ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఖర్చు చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement