Saturday, May 4, 2024

Multi Zone 1 – 10 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ

కరీంనగర్ (ప్రభ న్యూస్) మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 10 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐజిపి తరుణ్ జోషి శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత వారం జారీ చేసిన బదిలీ ఉత్తర్వులకు బదులుగా మరో ఉత్తర్వు జారీ చేశారు.

మంథని సిఐగా పనిచేసిన సతీష్ ను ధర్మపురికి గత వారం బదిలీ చేయగా దానికి బదులుగా ఐజి కార్యాలయానికి, బుద్దే స్వామిని జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ కు బదులుగా రామగుండం సిసిఆర్బికి, జగిత్యాల పట్టణ సిఐ నటీష్ ను అక్కడే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భూపాలపల్లి లో పనిచేస్తున్న రామ్ నరసింహారెడ్డిని ధర్మపురి సిఐ గా, కరీంనగర్ సిసిఆర్బి లో పనిచేస్తున్న దామోదర్ రెడ్డిని మల్యాల సిఐగా, డిసిఆర్బి నిర్మల్ లో పనిచేస్తున్న నాగపురి శ్రీనివాస్ ను భీమ్గల్ సిఐ గా, సిఐడీ లో పనిచేసిన శ్రీలత ను కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు, ఇటీవల మల్యాలకు బదిలీ అయిన నాగేశ్వరరావును జగిత్యాల సిసిఎస్ కు, సిసిఆర్బి రామగుండంలో పనిచేస్తున్న ఆకుల అశోక్, భీంగల్ లో పనిచేసిన వెంకటేశ్వర్లు ను ఐజి కార్యాలయానికి, కరీంనగర్ మహిళా టాన్ లో పనిచేస్తున్న శ్రీనివాసులు ఐజి కార్యాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వచ్చే వారం లో పెద్ద ఎత్తున ఇన్స్పెక్టర్ల బదిలీలు జరుగుతాయని సమాచారం. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల టౌన్, మంచిర్యాల రూరల్, శ్రీరాంపూర్, బెల్లంపల్లి వన్ టౌన్, లక్షెట్టిపేట, మంథని, గోదావరిఖని టూ టౌన్, రామగుండం, పెద్దపల్లి ఇన్స్పెక్టర్ల బదిలీ జరుగుతుందని విశ్వసినీయ వర్గాల సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement