Sunday, May 19, 2024

Review – న‌ష్టాల ఊబిలో సివిల్ స‌ప్లై శాఖ‌… గ‌త పాల‌కుల త‌ప్పిదాలంటూ ఉత్త‌మ్ ఫైర్

హైద‌రాబాద్ – సివిల్ స‌ప్లై సుమారు 11 వేల కోట్ల న‌ష్టాల‌లో ఉంద‌ని, ఆ సంస్థ ఆర్ధిక ప‌రిస్థితి తీవ్ర ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అన్నారు.. ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో ఆయ‌న నేడు స‌మీక్ష నిర్వ‌హించారు.. ధాన్యం సేకరణ, మిల్లింగ్‌ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు వివరించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ , గ‌త పాల‌కుల త‌ప్పిదాతాల‌తో ఆ శాఖ దివాళ తీసిందంటూ ఆరోపించారు..

గత ప్రభుత్వం ఈ శాఖ, ఆర్థిక శాఖకు సహాయం చేయకపోవడంతో 56 వేల కోట్లు అప్పు చేసింది. సివిల్ సప్లై కార్పొరేషన్ 90 లక్షల మెట్రిక్ టన్నులు. 18వేల కోట్ల విలువైన ప్యాడి రైస్ మిల్లర్ల వద్ద ఉంది. దీనిపై ఏం చేయాలనేది క్యాబినెట్‌లో చర్చిస్తాం. 1.17లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సివిల్ సప్లై వద్ద ఉంది. 11వేల కోట్ల నష్టాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఉంది. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో లోపాలు ఉన్నాయి. ఉన్న రేషన్ కార్డులో బియ్యం తీసుకున్న వారు 89 శాతం దాటిపోలేదు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ ఉంది. సీఎం దృష్టికి ఆ విషయాన్ని తీసుకువెళ్తా. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఆర్థిక పరిస్థితి బాగోలేదు’ అని ఉత్తమ్‌ చెప్పారు.

‘సివిల్ సప్లై శాఖ రాష్ట్రంలో ముఖ్యమైన శాఖ. రైతుల నుంచి ప్రోక్యూర్మెంట్ చేసే శాఖ. గ్యాస్ సిలిండర్ రూ. 500, ప్యాడి ప్రోక్యూర్మెంట్‌లో రూ. 500 పెంచేది వంద రోజుల్లో అమలు చేస్తాం. 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే కిలో బియ్యం క్వాలిటీ పెరగాలి. ఇప్పటివరకు ఒక కిలోనే ప్రతీ మనిషికి బీఆర్ఎస్ ఇచ్చింది. లబ్ధిదారుల నుంచి పీడీఎస్ రైస్ డైవర్ట్ అయ్యింది. లబ్ధిదారులకు తినగలిగే రైస్ ఇవ్వాలి. 2 కోట్ల 80 లక్షల మంది లబ్ధిదారులున్నారు. ప్రోక్యూర్మెంట్‌కు సివిల్ సప్లై అన్ని చర్యలు తీసుకోవాలి’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement