Thursday, May 2, 2024

అరక పట్టి దుక్కి దున్నడమంటే ఇంత కష్టమా – రైతుల‌కు రేవంత్ శాల్యూట్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: అరక పట్టి దుక్కి దున్నడమంటే ఇంత కష్టమా..! అంటూ టీ-పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పంటలు పండించేం దుకు రైతు లు పడుతున్న కష్టాలను స్వయంగా చూసి న ఆయన తన అనుభవాలను ట్విట్టర్‌ వేదికగా పంచు కున్నారు. ”హాత్‌ సే హాత్‌ జోడో” పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల వారిని కలుస్తూ ముందుకు వెళుతున్నారు. తన 11వ రోజు పాదయాత్రకలో భాగంగా శుక్రవారం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్రలో సేదదీరుతూ, ఆయన స్థానిక రైతుల తో సరదాగా కాసేపు ముచ్చటించారు. పొలంలో అరక దున్నుతున్న ఓ రైతు వద్దకు వెళ్లి, సేద్యం తీరు తెన్నులు పరిశీలించారు. ఆ తర్వాత తాను కూడా అరక దున్నే ప్రయత్న చేశారు. అయితే, రేవంత్‌ నెనకున్న జనాలను చూసి బెదిరిన ఆ ఎద్దులను నియంత్రించలేక ఆపసోపాలు పడ్డారు. నాగలి కర్రును రేవంత్‌ గట్టిగా భూమిలోకి అదిమి పట్టు-కోలేకపోవడంతో ఆ ఎద్దులు ఇష్టారాజ్యంగా పరుగులు తీశాయి. దాంతో రేవంత్‌ కూడా అరక దున్నలేక ఇబ్బందిపడ్డారు. ఈ విషయాన్ని రేవంత్‌ రెడ్డి వీడియో సహా ట్విట్టర్‌లో పంచుకు న్నారు. వ్యవసాయం అంటే ఎంత కష్టమో అని ఆయన పేర్కొన్నారు. రైతుల శ్రమ అంతా, ఇంతా కాదని, ఇది తాను అనుభవపూర్వకంగా చెబుతున్నానని తెలిపారు. మనమేమో హాయిగా ఇళ్ల వద్ద కూర్చుని ఆహారాన్ని ఆస్వాదిస్తుంటామని పేర్కొన్నారు. రైతులందరికీ సెల్యూట్‌ చేస్తున్నానని ఈ సందర్భంగా రేవంత్‌ వెల్లడించారు.

రైతులతో రాజకీయాలపై కాసేపు ముచ్చట
రేవంత్‌రెడ్డి స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా స్థానిక రైతులతో కాసేపు ముచ్చరించారు. పొలం పనులపైనే కాదు.. రాష్ట్ర రాజకీయాలు, కేసీఆర్‌ ప్రభుత్వం పైనా ఆయన ఆరా తీశారు. వారి సేధ్యపు కష్టాలు, పంటల లాభ నష్టాలను గురించి తెలుసుకున్నారు. ఊరు, వాడ ఏమనుకుంటున్నారని రైతులను ఆసక్తిగా అడిగారు. కాసేపు పొలంలో అరక దున్నుతున్న రైతు వద్దకు వెళ్లి, సేద్యం తీరుతెన్నులు పరిశీలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement