Friday, April 19, 2024

అమెరికాలో మ‌రోసారి కాల్పుల కలకలం.. ఆరుగురి దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. టేట్ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్ లోకి చొరబడిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, ఇద్దరు మృతిచెందారు. అనంతరం సమీపంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిన దుండగుడు ఇద్దరిని కాల్చి చంపాడు. మరో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్ వద్ద కాల్చి చంపాడు. వరుస కాల్పుల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. నిందితుడు కారులో పారిపోతుండగా పట్టకున్నామని చెప్పారు. అమెరికాలో జనవరి 23 తర్వాత జరిగిన సామూహిక హత్యాకాండ ఇదే.

Advertisement

తాజా వార్తలు

Advertisement