Tuesday, April 30, 2024

Open Letter to KCR – విద్యార్ధుల అడ్డంపెట్టుకుని నీచ రాజ‌కీయాలు – కెసిఆర్ పై రేవంత్ తీవ్ర విమ‌ర్శ‌లు

హైద‌రాబాద్ – విద్యార్థులను అడ్డం పెట్టుకొని కేసీఆర్ రాజకీయాలు చేసే స్థితికి దిగజారారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం పథకంలో లోపాలను ఎత్తిచూపుతూ సిఎంకు బ‌హిరంగ లేఖ రాశారు.. ఆలేఖ‌లో సవాలక్ష సమస్యలతో మిడ్ డే మిల్స్ అభాసు పాలు అవుతుందన్నారు . ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా సీఎం బ్రేక్ ఫాస్ట్ అంటూ హడావుడి చేశారని అంటూ ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.

పెరిగిన ధరలకు అనుగుణంగా మిడ్ డే మిల్స్ బడ్జెట్‌ పెంచలేదని,, మెనూలో మార్పుల వల్ల వంట కార్మికులకు ఆర్థిక భారం పెరిగిందన్నారు. చాలా పాఠశాలల్లో వంట గదులే సక్రమంగా లేవ‌ని,, చెట్ల కింద వంట చేయడంతో భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురి అవుతున్నారని రేవంత్ ఆరోపించారు. వంట కార్మికుల సమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదని కేసీఆర్ కు రాసిన లేఖలో ప్రస్తావించారు రేవంత్ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement