Thursday, May 9, 2024

బిఆర్ఎస్ కి మౌత్ పీస్ గా బిజెపి – రేవంత్ రెడ్డి..

హైద‌రాబాద్ – తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపు చూస్తున్న త‌రుణంలో బిజెపి,బిఆర్ఎస్ లు కొత్త నాట‌కానికి తెర‌తీశార‌ని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు.. గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ, టీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో మ‌రోసారి తేట‌తెల్ల‌మైంద‌ని చెప్పారు.. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ పచ్చి అబద్ధాలతో కేసీఆర్‭ను ప్రశంసించారని రేవంత్ మండిపడ్డారు.

ఇప్పటి వరకు అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును చెండాడిన గవర్నర్ ఇప్పుడు స్వరం ఎందుకు మార్చారని ప్రశ్నించారు. బిజెపి పూర్తిగా కెసిఆర్ కి స‌రెండ‌ర్ అయిపోయంద‌ని, అందుకే అసెంబ్లీలో కెసిఆర్ ప్ర‌భుత్వాన్ని ఘ‌నంగా పొగిడార‌ని అన్నారు.. ఇక నుంచి కేటీఆర్ క్యాట్ వాక్, డిస్కో డాన్స్‭ల గురించి మాట్లాడుకుంటే మంచిదన్నారు. దేశ భద్రత, సంస్కృతి ఆయనకు తెలియదని రేవంత్ విమర్శించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‭కు లేదన్నారు. కాంగ్రెస్‭కు దేశ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేని కేసీఆర్‭కు ఇవే చివరి ఎన్నికలని, అందుకే ఈ రోజు కొడుకుకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇచ్చారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement