Wednesday, May 1, 2024

TS | మున్సిపాల్ చైర్మన్, వైస్ చైర్మన్ రాజీనామా..

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో మంగళవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబుపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) దివాకర కు తీర్మానం కాపీని అందజేశారు.

దీంతో మంగళవారం రాత్రి భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబులు తమ రాజీనామా పత్రాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. డబుల్ బెడ్ రూమ్ ఎంపిక పారదర్శకంగా చేపట్టినందున కౌన్సిలర్లు తమ అనుచరులకు ఇండ్లు కేటాయించలేదనే అక్కసుతోనే త‌మ‌పై అవిశ్వాసం పెట్టారని, దీంతో పార్టీకి నష్టం జరుగుతుందని భావించి రాజీనామా చేస్తున్న‌ట్టు వారు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement