Thursday, May 2, 2024

TS : డ్ర‌గ్స్ కేసులో క్రిష్ కు ఊర‌ట‌..

డ్రగ్స్‌ కేసులో సినీ దర్శకుడు క్రిష్‌ ఊరట లభించింది. విచారణలో భాగంగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగిటివ్‌గా వచ్చింది. ఇటీవల గచ్చిబౌలి ర్యాడిసన్‌ హోటల్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీలో క్రిష్‌ కొకైన్‌ తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌, చరణ్‌లకు మూత్ర పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

కోర్టు అనుమతితో పోలీసులు వీరిద్దరి నుంచి రక్తనమూనాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌ ల్యాబ్‌కు పంపించగా, రిపోర్టు వచ్చిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశమున్నది. గోవాకు చెందిన అబ్దుల్‌ నుంచి డ్రగ్స్‌ నగరంలోని సప్లయర్‌ రెహమాన్‌కు చేరిందని, పలు ఎన్‌డీపీఎస్‌ కేసుల్లో రెహమాన్‌ నిందితుడిగా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. గోవా, బెంగళూర్‌లో వీరికోసం ప్రత్యేక బృందాలు గాలిస్తుండగా, ర్యాడిసన్‌ హోటల్‌ యాజమాన్యంపై కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement