Saturday, May 4, 2024

Crime – బెంగళూర్ పేలుళ్లు – మైదుకూరులో ఒకరి అరెస్ట్

కడప- ప్రభ న్యూస్బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో కడప జిల్లా మైదుకూరులో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. పిఎఫ్ఐ సభ్యుడు సలీం ను అదుపులోకి తీసుకుంది. ఈయనను హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. ఉత్తర తెలంగాణకు చెందిన సలీం గత 25 రోజులుగా మైదుకూరులో మకాం వేసినట్టు తెలుస్తోంది.

కడప జిల్లాలో టెర్రరిస్టు లింకులపై తీవ్ర కలకలం చోటు చేసుకుంది.బెంగళూరు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు అలర్ట్ అయ్యారు. రెండు రోజులుగా హైదరాబాదులో తీవ్ర సోదాలు చేస్తున్న అధికారులు ఆదివారం కడప జిల్లా మైదుకూరులో తనిఖీ నిర్వహించారు.

మండలం చెల్రోపల్లె వద్ద సలీం ఓ నివాసంలో తలదాచుకున్నట్లుగా అనుమానిస్తున్న సలీం ను మైదుకూరులో అదుపులోకి తీసుకున్నారు. చెర్లోపల్లి కు చెందిన జేసీబీ ఓనర్ కు ఆగంతకుడు ఫోన్ చేసి రెండు రోజులు ఉంచుకోమని కాల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో 25 రోజులుగా సలీం మైదుకూరు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

సలీంను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. కాగా సలీం పై రెండులక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement