Tuesday, April 30, 2024

సీసీటీవీలో రికార్డు: పరువు హత్యగా అనుమానం.. మూకుమ్మడిగా దాడిచేసి చంపేశారు

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం మే 4న) ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేస్తున్న ఘటన సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు నాగరాజు రెండు నెలల క్రితం సయ్యద్ సుల్తాన అనే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. అయితే.. నాగరాజు తన స్కూటర్‌పై రోడ్డు పక్కన వేచి ఉండగా అతనిపై ఒకేసారి ముగ్గురు, నలుగురు వ్యక్తులు అకస్మాత్తుగా దాడి చేశారు.

ఆ తర్వాత అతను రోడ్డుపై పడిపోయాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రతి ఒక్కరూ బాధితుడిపై దాడి చేస్తుంటే అలా చూస్తుండి పోయారే కానీ, ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్న చేయలేదు. అయితే.. వారు వేర్వేరు మతాలకు చెందిన వారు కావడంతో నాగరాజును ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారని నాగరాజు బంధువులు ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement