Wednesday, May 1, 2024

మాల్‌ చౌరస్తాలో నిరసన

యాచారం : యాచారం మండల పరిధిలోని మాల్‌పట్టణ కేంద్రంలో ఏబివిపి ఆద్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేకం ఐలేష్‌ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య దేశ భక్తి ,జాతీయ భావాలు నింపాల్సింది పోయి కులాల గురించి మతాల గురించి తెలియజేస్తు సమాజంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాన్ని స్వేరో సంస్థ చేస్తుందని అన్నారు. అంబేద్కర్‌ను వదలమని చెప్పుకునే స్వేరో సంస్థ అంబేద్కర్‌ ఆశయాలకు ఆలోచనలకు వ్యతిరేకంగా స్వేరో సంస్థ చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై స్వేరో సంస్థ దాడులు చేసే ప్రయత్నం చేస్తుందని కావున రాష్ట్ర ప్రభుత్వం స్వేరో సంస్థను నిషేధించి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఎబివిపి డిమాండ్‌ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి జిల్లా నాయకులు నరేందర్‌గౌడ్‌, సాయి, కృష్ణ, గణేష్‌, మౌనిక, నవీన్‌, రోజా, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement