Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి..

కీసర, (ప్రభ న్యూస్): కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై యాద్గార్పల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. డీసీఎం టిఎస్ 05 యుఎఫ్ 3876 వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే… ఔటర్ రింగ్ రోడ్డుపై పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్న కూలీలు లింగమ్మ (42), తిరుపతమ్మ (43) లు పనుల్లో నిమగ్నమై ఉండగా, సడెన్ గా ఓవర్ స్పీడ్ తో వచ్చిన డీసీఎం వారిని ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు బీరంగూడ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement